నిరుపేద యువతి వివాహానికి వెస్సో సంస్థ ఆర్ధిక సహాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన చేవూరి శ్రీనివాసాచారి శారద వైజయంతి వివాహానికి వెస్సో సంస్థ ఆర్ధిక సహాయం అందించి తన ఔదర్యాన్ని చాటుకుంది. స్వర్ణకార వృత్తిలో చాలీచాలని ఆదాయం కారణంగా తమకు తెలిసిన ఆయుర్వేద వైద్యం చేస్తూ కుటుంబ పోషణ చేస్తూ ఉన్నారు. చేవూరి శ్రీనివాసాచారికి భార్య, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మానసికంగా పెద్దగా ఎదుగుదల లేని అవివాహిత. వీరి చిన్న కుమార్తె శారద వైజయంతి వివాహం విజయవాడ పటమట  బ్రహ్మం గారి గుడిలో జరిగింది.ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం ప్రధాన సంచాలకులు బ్రహ్మశ్రీ అప్పలభక్తుల శివకేశవ రావు(శివశ్రీ) ద్వారా కూతురి వివాహ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించమని శ్రీనివాసాచారి వెస్సోని కోరారు.  వెస్సో గౌరవ దాతల సహకారంతో వైజయంతి కి రూ.40,000/-లు అందచేసింది.ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ వైజయంతి వివాహానికి సహాయ మందించిన గౌరవ దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.