19వ తేదీకి చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడుఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 19వ తేదీ వరకు విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. క్వాష్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేసేందుకు సీఐడీకి సమయం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్‌పై సోమవారం ( ఈ నెల 18వ తేదీ ) దాకా విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఏపీ హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ కస్టడీకి చంద్రబాబును పంపవద్దని ఆయన తరఫు లాయర్లు హైకోర్టును విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించి న్యాయస్థానం సోమవారం కస్టడీకి ఇవ్వద్దని ఆదేశించింది. అలాగే అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా ఈ నెల 19వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.