టాటా మణి ట్రస్ట్ ఆద్వర్యం లలో పేద విద్యార్థులకు స్కూల్ డ్రెస్ ల పంపిణి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చందనగర్ లోని హెచ్‌పి ఫౌండేషన్ స్కూల్ లోని సుమారు 150 మంది పేద విద్యార్థులకు టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కె.జ్యోతి ఆద్వర్యం లో బి.శ్రీనివాస రెడ్డి, పి సునీత రెడ్డి ల ఆర్దిక సహకారం తో  స్కూల్ డ్రెస్ లను పంపిణి చేసారు.అలాగే వెతి తో పాటు న్యూట్రిషన్ ఫుడ్, గుడ్లును హెచ్‌పి ఫౌండేషన్ స్కూల్ చర్మెన్  కొమ్ము ప్రవీణ్ కుమార్ కు అందజేశారు.ఈ కార్యక్రమం లో కే.ప్రవీణ్ కుమార్, పి.జగదీష్ కుమార్, పి.సునీతారెడ్డి, బి.శ్రీనివాస రెడ్డి, పి.ఉషా రాణి, రాజేష్ నాయక్, ఎం.శ్రీలక్ష్మి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కె.జ్యోతి మాట్లాడుతూ ఆర్దికంగా , వెనుకబడిన నిరుపేదలకు తమ ట్రస్ట్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు.ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో నిరుపేదలకు బట్టల పంపిణి,పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్, బ్రేడ్స్, బిస్కెట్స్ లను అందజేసినట్లు ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.