ఐపిసి ఓబీసీ విభాగం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేష్ యోబు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రజా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా యదాద్రి భువన గిరి జిల్లా రాజపేట వెంకటేష్ ఓబు నియ్తమితులైనారు.ఈ మేరకు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఐపీసీ క్యాంప్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాద్ నందు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఓబు మాట్లాడుతూ ఐపిసి పంచసూత్రులైన మాతృ ప్రేమతో పరిపాలన ప్రతి మనిషికి విద్య వైద్యం ఉచితం భారతదేశ మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం మతసామరస్యాన్ని పాటిస్తూ గోవు ను జాతీయ ప్రాణిగా ప్రకటించడం మానవసేవే మాధవసేవ స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రతి కుటుంబము సుఖసంతోషాలతో జీవించడమే ఆశయంగా అనే సూత్రాలకు ఆకర్షితునై ఐపీసీ పార్టీ లో చేరినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పర్యటన చేసి గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పర్యటించి పార్టీ పటీష్టత కు కృషి చేస్తానని తెలిపారు త్వరలోనే తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ఐపీసీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుటకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వెంకటేష్ ని జాతీయ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమంలో ఐపిసి ఓబీసీ భాగం జాతీయ ప్రధాన కార్యదర్శి విఠోబా జాతీయ ప్రధాన కార్యదర్శి మోహన్ గాంధీ మరియు కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఐపీసీ క్యాంప్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాద్ నందు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శివ కుమార్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడు నవీన్ దివ్యాంగ విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి మహాలక్ష్మి మహిళా విభాగం జాతీయ సంయుక్త కార్యదర్శి అరుణ రెడ్డి ఐపిసి క్యాంప్ ఆఫీస్ ఇన్చార్జి నందికొండలరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.