డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ నర్కోటిక్ బ్యూరో ఎదుట హాజరు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో సినీ నటుడు నవదీప్‌ శనివారం నార్కోటిక్‌ బ్యూరో ఎదుట హాజరయ్యాడు. దాదాపు అధికారులు ఆరుగంటల పాటు విచారించారు. విచారణ అనంతరం నవదీప్‌ మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు డ్రగ్స్‌ కేసులో విచారించారించరని తెలిపారు. టీఎస్‌ నాబ్‌ అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారని, టీఎస్‌ నార్కోటిక్‌ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉన్నదని పేర్కొన్నారు. అయితే, ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా విచారిస్తున్నారని, బీపీఎం అనే క్లబ్‌తో నాకున్న సంబంధాలపై ఆరా తీశారని చెప్పుకొచ్చారు. కొంత సమాచారం తెలుసుకునేందుకు విచారణకు రావాలని నోటీసు ఇచ్చారని.. అయితే, నేనెప్పుడు డ్రగ్స్‌ తీసుకోలేదని నవదీప్‌ తెలిపారు.విశాఖకు చెందిన రామచంద్‌ దగ్గర నేను డ్రగ్స్‌ కొనలేదని, గతంలో పబ్‌ నిర్వహించినందుకే నన్ను విచారించారని చెప్పారు. గతంలో సిట్‌, ఈడీ విచారించిందని, ఇప్పుడు తెలంగాణలో నార్కోటిక్‌ పోలీసులు విచారిస్తున్నారన్నారు. నార్కోటిక్‌ అధికారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పారన్నారు. అయితే, నవదీప్‌ సెల్‌ఫోన్‌ను నార్కోటిక్‌ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, విచారణ సమయంలో కాల్‌లిస్ట్‌ను ముందుంచి విచారణ జరిపినట్లుగా తెలుస్తున్నది. వాట్సాప్‌ చాటింగ్‌ను అధికారులు రిట్రీవ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. డేటా అందించిన తర్వాత మరోసారి నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు వివరించారు.

 

 

Leave A Reply

Your email address will not be published.