చరిత్రలో లేనివిదంగా తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల కోసం సర్వే

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వందేభారత్ రైళ్ళ ప్రారంబోత్సవంలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశంలో చారిత్రక, ప్రఖ్యాత111 నగరాలను అనుసంధానం చేస్తూ.. ఈరోజు 9 వందే భారత్​ రైళ్లను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు. వందేభారత్ రైళ్ళ ప్రారంబోత్సవంలో కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే రెండు వందే భారత్​ రైళ్లు వచ్చాయి. ఈ రోజు మూడో వందే భారత్​ వచ్చిందన్నారు. హైదరాబాద్​– బెంగళూరు రైలును ప్రధాని ప్రారంభిస్తున్నారు. వినాయక చవిత సందర్భంగా మూడో ట్రైన్​ ప్రారంభించుకోవడం శుభపరిణామం అన్నారు. హైదరాబాద్​ కేంద్రంగా మూడు వందే భారత్​ రైళ్లను ప్రారంభించుకోవడం గొప్ప విషయం. మూడు వందే భారత్​ రైళ్లను ఇచ్చినందుకు ప్రధాని మోడీకి, రైల్వే శాఖమంత్రికి తెలుగు, తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

కాచీగూడ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు.. మూడు రాష్ట్రాలను కలుపనుంది. 12 జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. రెండు ఐటీ(హైదరాబాద్​,బెంగళూరు) రాజధానులను ఈ రైలు అనుసంధానం చేయబోతున్నది. బెంగుళూరుకు వందే భారత్​ రైలు రాకతో ఒకే రోజు వెళ్లి రావొచ్చు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ప్రధాని మోడీ గారు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబర్​ 1, 3 వ తేదీల్లో ప్రధాని మోడీ తెలంగాణకు రాబోతున్నారు. ఆరోజు కూడా అనేక రైల్వే ప్రాజెక్టులకు ఫౌండేషన్​ స్టోన్​ వేయబోతున్నారన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్​ నిర్మాణం చేపట్టారు.

అన్ని రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో రైల్వే నెట్​ వర్క్​ తక్కువగా ఉన్నది. ఆ విషయం గ్రహించే.. ప్రధాని మోడీ అధిక రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ ఏడాది రూ.4,418 కోట్ల రైల్వే బడ్జెట్​ కేటాయించింది మోడీ ప్రభుత్వం. 2014 యూపీయే హయాంలో తెలంగాణకు రైల్వే బడ్జెట్​ రూపంలో రూ.258 కోట్లు ప్రవేశపెట్టారు. మోడీ గారు తెలంగాణ రైల్వేల అభివృద్ధి కోసం రూ. 4,418 కోట్లు కేటాయించారంటే.. ఎంత శాతం బడ్జెట్​పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అన్నారు.  తెలంగాణలో 31 వేల కోట్ల రూపాయల రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయి. దాదాపు రూ.2300 కోట్లతో తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. 21 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను ప్రధాని ఆ మధ్య వర్చువల్​గా ప్రారంభించారు. సికింద్రాబాద్​ స్టేషన్​కు 717 కోట్ల రూపాయలు కేటాయించి, ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. హైదరాబాద్​ ఎయిర్​పోర్ట్​ ఎలా ఉంటుందో.. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ అలా కాబోతున్నదన్నారు.

నాంపల్లి రైల్వే స్టేషన్​ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. కాచీగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నాం. చర్లపల్లిలో రూ. 221 కోట్ల న్యూ టెర్మినల్​ నిర్మాణం కాబోతున్నది. కాజీపేటలో రైల్​ మ్యానుఫ్యాక్చర్​ యూనిట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఫస్ట్​ పేజ్​లో వ్యాగన్​ మ్యానుఫ్యాక్చరింగ్​ మొదలవుతుంది. తర్వాత రైలుకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అక్కడ తయారవుతాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనట్టు.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల కోసం పూర్తి స్థాయిలో సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రజలు రైల్వే సర్వీసులను ఉపయోగించుకోవాలి. వందే భారత్​ రైళ్లలో కలిగి అనుభూతి అంతా ఇంతా కాదు. రీజినల్​ రోడ్డుతోపాటు దానికి అనుసంధానిస్తూ.. రీజినల్​ రైలు రావడం హైదరాబాద్​కు ఒక గేమ్​ చేంజర్​గా మారబోతున్నది. హైదరాబాద్​ మరింత అభివృద్ధి చెందాలంటే.. ఆర్​ఆర్​ఆర్​ అత్యంత కీలకం అని పేర్కొన్నారు. ట్రిపుల్​ఆర్​ వస్తే.. కనెక్టివిటీ పెరిగి ఆ రోడ్డు లోపల పేదలకు తక్కువ ధరకు భూములు దొరుకుతాయి. పేదల సొంతింటి కల నెరవేరుతుంది. ఏ రాష్ట్రానికి లేని విధంగా అత్యధికంగా మనకు వందే భారత్​ రైళ్లు వస్తున్నాయి. అందుకు అంకితభావంతో కృషి చేస్తున్న రైల్వే శాఖ అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.