మోడీ పాలనలో ఎనిమిదేళ్లలో ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందలేదు

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: మోడీ పాలనలో ఈ 8 యేండ్లలో ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందలేదని మంత్రి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎంపీ లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ వి. జి. గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం లు పేర్కొన్నారు. సోమవారం వారు టిఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ కేంద్రం బీజేపీ పాలన కు ఎనిమిదేళ్లు పూర్తి అయ్యాయి, మోడీ ప్రధాన మంత్రిగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్నారు ఈ ఎనిమిదేళ్లలో ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందలేదని, ఏ ఒక్క వర్గం సంతృప్తి గా లేదు, ఎనిమిది ఏళ్లలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ నానాటికి పతనమైంది, మోడీ ప్రధాని అయినపుడు డాలర్ విలువ 58 రూపాయలు ఇపుడు డాలర్ 82 రూపాయలకు చేరింది అన్నారు. ద్రవ్యోల్భణం పెరిగిపోతోంది ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది, 2014 లో ఆర్ధిక వృద్ధి రేటు 7 శాతం ఉంటే ఇప్పుడది 5 శాతానికి దిగజారింది బీజేపీ నేతలు ఒప్పుకోకున్నా ఇవి నిజాలు గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో భారత్ స్థాయి 121 దేశాల్లో 107 స్థానం గా ఉంది. 2014 లో హంగర్ ఇండెక్స్ లో 55 వ స్థానం లో ఉన్నాం అన్నారు. ఆసియా దేశాల్లో ,పొరుగున ఉన్న దేశాలతో పోలిస్తే హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం దిగజారి పోయింది. హ్యాపీనెస్ ఇండెక్స్ లో 136 వ స్థానంలో ఉన్నాం..2014 లో 117 వ స్థానం లో ఉన్నాం
అసమానతలు తగ్గించే ఇండెక్స్ లో 123 వ స్థానం లో ఉన్నాం, మానవ అభివృద్ధి ఇండెక్స్ లో 133 వ స్థానం లో ఉన్నాం, అన్నింటిలో మోడీ పాలన భారత్ స్థాయి ని దిగజార్చింది అని పేర్కొన్నారు. మోడీ పాలన లో నిరుద్యోగo పెరిగింది, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఉద్యోగాల భర్తీ తగ్గింది. రుణ ఎగవేత దారులకు 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డాలర్ బలపడుతోంది కనుక రూపాయి విలువ పడిపోతోంది అంటున్నారు రూపాయి విలువ పడిపోతోంది కనుకే డాలర్ విలువ పెరుగుతోంది అని మేమంటున్నాం అన్నారు. ఇందులో తేడా ఏమైంది అని ప్రశ్నించారు. చమురు ధరలు పెరిగాయని చెప్పి అధికారం లోకి వచ్చి మోడీ వాటిని తగ్గించారా
దేశం లో పరిస్థితులు దిగజారి పోతుంటే బీజేపీ నేతలు అహో మోడీ ఓహో మోడీ అని జబ్బలు చరచు కుంటున్నారు, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దిగజార్చారు, తెలంగాణ పై బీజేపీ కక్ష కట్టింది, తెలంగాణ కు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు,
తెలంగాణ బీజేపీ నేతలు చవటలు దద్దమ్మలు గా వ్యవహరిస్తున్నారు, తెలంగాణ బీజేపీ నేతలకు భాద్యత లేదా అని ప్రశ్నించారు. బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటారా తెలంగాణ కు అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారు
బీజేపీ కి బడుగు బలహీన వర్గాలంటే బీజేపీ కి గిట్టదు, పేదవర్గాలకు అన్యాయం చేసేందుకే బీజేపీ రిజర్వేషన్లు, సబ్సిడీ లు ఎత్తివేసే కుట్ర చేస్తోంది
ప్రశ్నించే వాళ్ళను అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారు, ప్రత్యర్థి పార్టీ లపై ed, cbi లను వాడుకుని బీజేపీ వేధిస్తోంది, ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం గతం లో లేదు అన్నారు. అభివృద్ధి చేశాము ఓటెయ్యండి అని చెప్పుకోవడానికి బీజేపీ దగ్గర ఏమీ లేదు
అందుకే బీజేపీ మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసి ఓట్లు దండుకోవాలని చూస్తోంది,
బీజేపీ పేదలకు బడుగు బలహీన వర్గాలకు శత్రువు, బీజేపీ పట్ల ఈ వర్గాలు అప్రమత్తంగా ఉండాలి,
బీజేపీ మనువాద పార్టీ, బీజేపీ అధికార దాహం, రాజగోపాల్ రెడ్డి అహంకారం మునుగోడు ఉపఎన్నికకు కారణమయ్యాయి,
కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కోవర్టు గా పని చేశానని 18 వేల కాంట్రాక్టు దక్కింది నిజమేనని రాజగోపాల్ రెడ్డి అంగీకరించారు, రాజగోపాల్ ది కోవర్టు చర్య కాక మరేమిటి? కోవర్టు అంటే రాజగోపాల్ కు ఎందుకు ఉలికి పాటు, కోమటి రెడ్డి వెంకట రెడ్డి కి ఇవన్నీ తెలియవా. తన పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఎన్నికలు జరుగుతుంటే కోమటి రెడ్డి ఎందుకు ప్రచారానికి వెళ్ళరు? కోమటి రెడ్డి వెంకట రెడ్డి కోవర్టు కాక మరేమిటి?
కోమటి రెడ్డి సోదరులను కోవర్టు సోదరులు అని kt రామారావు అనడం ముమ్మాటికీ కరెక్ట్
డబ్బు ఉందనే అహంకారం తో కోమటి రెడ్డి బ్రదర్స్ విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. వారికి గుణ పాఠం చెప్పాలి.. మునుగోడు ప్రజలు వారికి రాజకీయంగా సమాధి కట్టాలి. కేసీఆర్ తెలంగాణ రక్షకుడు. మునుగోడు ప్రజలు ఆ కోణం లోనే తీర్పు నివ్వాలి
బీజేపీ కి మునుగోడు లోఓటు అడిగే హక్కు లేదు, ఎనిమిదేళ్లలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేసిన తీరు చూసి మునుగోడు ప్రజలు టీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలి. ముమ్మాటికీ మునుగోడు లో గెలిచేది టీ ఆర్ ఎస్ యే. మాది రాజకీయ పార్టీ మునుగోడు లో మా పార్టీ నేతలు మా అభ్యర్థి గెలుపు కోసం అక్కడ పనిచేస్తే తప్పేమిటి అని ప్రశ్నించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు కేసీఆర్ వల్లే రాజకీయంగా గుర్తింపు వచ్చింది. 2014,2019 లో ఎంపీ గా పోటీ చేసే అవకాశం టీ ఆర్ ఎస్ బూర కు ఇచ్చింది
2019 లో ఎంపీ గా ఓడిపోయినా బూరకు కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మా కంటే ఎక్కువగా బూర కేసీఆర్ ను కలిశారు
ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రి లో పర్యటించినపుడు బూర కు అన్నింటా ప్రాధాన్యత లభించింది. వెనక బడిన వర్గాలకు టీ ఆర్ ఎస్ ప్రాధాన్యత ఇవ్వడం లేదని బూర చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధం. రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు బీసీ లకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. గొర్లు కాచుకునే నాకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు కేసీఆర్. ఇది బీసీ లకు గౌరవం లభించినట్టు కాదా? ఇన్నేళ్లలో బీసీ లకు లభించని గౌరవం కేసీఆర్ ఈ ఎనిమిదేళ్ల పాలనలో లభించింది. గురుకులాల సంఖ్య పెంచి కేసీఆర్ బీసీ లకు విద్యావకాశాలు పెంచారు. చేతి వృత్తులకు ఆదరణ పెంచింది కేసీఆర్ యే. గీత నేతన్నలకు కేసీఆర్ హాయం లో కొత్త పథకాలు వచ్చాయి. బీజేపీ కుట్ర లో పావుగా మారి బూర కేసీఆర్ ను విమర్శించొద్దు
బీజేపీ లో బూర ను కానే వాడు ఎవరు ఉండరు. బీజేపీ లో బండి సంజయ్ కే దిక్కు లేదు.. బూరను ఎవ్వరు పట్టించుకుంటారు
బీసీ లు మునుగోడు లో టీ ఆర్ ఎస్ వెంటే ఉన్నారు.. బీజేపీ అహంకారాన్ని ఓడిస్తారని వారు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.