ఓటమి భయంతో కేసీఆర్ నన్ను పార్టీలోకి రమ్మని బేరసారాలకు దిగుతున్నాడు

    కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ సర్కారుపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామంలో షబ్బీర్ అలీ పర్యటించారు.”సిద్దిపేట, గజ్వేల్ భూములు దోచుకొని కామారెడ్డిలో మిగిలిన అసైన్డ్ భూములను దోచుకోవడానికి సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పటికే జంగంపల్లి గ్రామంలో వందల ఎకరాలు కవిత పేరిట రిజిస్ట్రేషన్, లచ్చాపేటలో 450 ఎకరాలు కేటీఆర్ పేరిట రిజిస్ట్రేషన్. భూములు దోచుకోవడానికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి భయంతో తన బంధువులతో నన్ను పార్టీలోకి రమ్మని బేరసారాలకు దిగుతున్నాడు. 6 గ్యారెంటీ పథకాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కామారెడ్డి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. గెలిచాక వారి రుణం తీర్చుకుంటా.” అని షబ్బీర్ అలీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.