వినాయకుని ఆశీస్సులతో యువత ఉన్నత శిఖరానికి ఎదగాలి

  జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి  కోవూరి సత్యనారాయణ గౌడ్.

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి సదాశివపేట పట్టణంలో శ్రీరామ సేన యూత్  ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క  విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో  పాల్గొన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది  కోవూరి సత్యనారాయణ గౌడ్ విఘ్నేశ్వరుడికి శాలువా కప్పి, అరటి పండ్లను సమర్పించి ఆ గణనాథుని ఆశీస్సులు  పొందుతూ యువతరం బాగుండాలని,ఆ గణనాథుడు యువతకు ఆయుఆరోగ్యాలను ప్రసాదించి  మంచి భవిష్యత్తు బాట చూపాలని ఆ గణనాథుని వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీరామ్ సేన  యూత్ సభ్యులు  ఉదయ్ కిరణ్, ప్రభు,  సారా శ్రీనివాస్ గౌడ్,  కోవూరి శ్రీకాంత్ గౌడ్,   జె.అంజయ్య మరియు సదాశివపేట పట్టణ ప్రజలు  అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.