వినాయకుని ఆశీస్సులతో యువత ఉన్నత శిఖరానికి ఎదగాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కోవూరి సత్యనారాయణ గౌడ్.
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి సదాశివపేట పట్టణంలో శ్రీరామ సేన యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమంలో పాల్గొన జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ విఘ్నేశ్వరుడికి శాలువా కప్పి, అరటి పండ్లను సమర్పించి ఆ గణనాథుని ఆశీస్సులు పొందుతూ యువతరం బాగుండాలని,ఆ గణనాథుడు యువతకు ఆయుఆరోగ్యాలను ప్రసాదించి మంచి భవిష్యత్తు బాట చూపాలని ఆ గణనాథుని వేడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీరామ్ సేన యూత్ సభ్యులు ఉదయ్ కిరణ్, ప్రభు, సారా శ్రీనివాస్ గౌడ్, కోవూరి శ్రీకాంత్ గౌడ్, జె.అంజయ్య మరియు సదాశివపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.