చంద్రబాబు అరెస్ట్‌ పై రాష్ట్రపతిని కలిసిన నారా లోకేష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఈ అరెస్ట్‌పై స్పందించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది మూర్ముని కోరారు. మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి మూర్ముని నారా లోకేష్, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు కలిశారు. కక్ష సాధింపులో భాగంగా చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని, నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం అవినీతి బురదజల్లే లక్ష్యంతో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని, ఆధారాలను రాష్ట్రపతికి అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతిని నారా లోకేష్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.