మల్లూరు గ్రామాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/నిజాంసాగర్ ప్రతినిధి: నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామాన్ని జుక్కల్ మాజీ ఎమ్మల్యే సౌధగర్ గంగారాం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన  .గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేసి మల్లూర్ గ్రామ ప్రజలకు అండగా, తోడుగా, ధైర్యంగా ఉంటా అని హామీ ఇచ్చారు.నిజాంసాగర్ మండల BRS నాయకుల తీరును కండిస్తు ప్రజల చేత ఎన్నుకోపడ్డ ప్రజానాయకులు ప్రజలనే దుర్భాషలాడడం సరికాదు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,జుక్కల్ ప్రచార కమిటీ అధ్యక్షులు సౌధగర్ అరవింద్,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మల్లయ్యగారి ఆకాష్, ఒడ్డేపల్లి పండరి,రాజారాం,శంకర్,శ్రీనివాస్ రెడ్డి,హన్మండ్లు, బుడ్మి శ్రీనివాస్, బుడ్మి సతీష్,మదెల్చేర్ గంగారాం,భాస్కర్,కొడిగంటి సాయిలు తదితరులు గ్రామస్థులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.