టెట్ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయు అర్హత పరీక్ష) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 15న జరిగిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే బుధవారం విడుదల చేశారు. అభ్యర్థులు https://tstet.cgg.gov.in/ అనే అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.టీఎస్ టెట్ పేపర్-1కు 2.26 లక్షల మంది అభ్యర్థులు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. పరీక్షలు సెప్టెంబర్ 15న జరుగగా సెప్టెంబర్ 20న టెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు. సెప్టెంబర్ 23 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఇవాళ ఫలితాలను వెల్లడించారు.