త్వరలోనే మిషన్(శుక్ర గ్రహం) వీనన్

: ఇస్రో ఛైర్మన్ సోమనాథ్..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. ఆసక్తికర వివరాల్ని వెల్లడించారు. ఆదిత్యఎల్1 విజయవంతంగా దూసుకెళుతున్న వేళ.. ఇప్పుడు శుక్ర గ్రహం మీద ఫోకస్ చేసింది. 2029-31 మధ్యలో శుక్రుడి చేసినట్లుగా పేర్కొన్నారు. త్వరలోనే మిషన్ వీనన్ ను చేపట్టనున్న విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పేలోడ్లు డెవలప్ చేసినట్లుగా ఆయనపేర్కొన్నారు. సౌర వ్యవస్థలో సూర్యుడి నుంచి రెండో గ్రహంగా.. అత్యంత ప్రకాశవంతమైన గ్రహంగా పేరుంది. దీనిని ఎర్త్ సిస్టర్ ప్లానెట్ అని కూడా వ్యవహరిస్తారు. శుక్రుడిపై పూర్తిగా మందపాటి కార్బన్ డైయాక్సైడ్ వాతావరణం ఉంటుంది. చుట్టూ సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలతో కప్పబడి ఉంటుంది. లేత పసుపు రంగులో ఉ ండే శుక్ర గ్రహం అత్యంత వేడి గ్రహంగా చెబుతారు. శుక్ర గ్రహం చాలా ఆసక్తికర గ్రహమని ఆయన పేర్కొన్నారు. దానిపై వాతావరణం చాలా మందంగా టుందన్న సోమనాథ్.. “శుక్రుడి మీద వాతావరణ పీడనం భూమి కంటే వంద రెట్లు ఎక్కువ, 10వేల ఏళ్ల తర్వాత భూమి లక్షణాలు మారిపోవచ్చు. భూమి కూడా ఏదో ఒక రోజు శుక్రుడిలా కావొచ్చు” అని పేర్కొన్నారు. మరోవైపు వీనస్ ను టార్గెట్ చేసిన అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో నాసా కూడా ఉ మీద పరిశోధనల దిశగా ప్రయోగం చేసే వీలుంది. ఇస్రో అంతకు ముందే తన ప్రయోగాన్ని చేపడుతుందన్న అంచనాలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.