అలుగు దుంకుతున్న కుంతాలమ్మ చెరువు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలోని కుంతాలమ్మ చెరువు 7 ఏళ్ల తర్వాత ప్రకృతి అందాలను తలపిస్తుంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కుంతాలమ్మ చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ఏడు సంవత్సరాల అనంతరం చెరువు అలుగు పారుతూ ఉంది. పెద్ద ఎత్తున గ్రామస్తులు చెరువు వద్ద ప్రకృతి అందాలు తిలకించేందుకు వెళ్తున్నారు.