కడుపులో నట్లు, బోల్టులు, వైర్లు..సర్జరీ చేసి తీసిన డాక్టర్లు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పితో 40 ఏళ్ల వ్యక్తి హాస్పిటల్కు వెళ్లాడు. నొప్పి ఎక్కువగా ఉందనడంతో.. అతనికి ఎక్స్ రే తీశారు. ఆ రిపోర్టు చూసిన డాక్టర్లు ఖంగుతిన్నారు. రెండేళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి కడుపులోంచి విచిత్రమైన వస్తువుల్ని డాక్టర్లు సర్జరీ చేసి తీశారు. ఈ ఘటన పంజాబ్లోని మోగాలో జరిగింది. ఆ నగరంలో ఉన్న మెడిసిటీ హాస్పిటల్లో అతనికి చికిత్స చేశారు.. ఆ వ్యక్తి కడుపులో ఉన్న వస్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఆ పేటెంట్ కడుపులో అన్నీ మెటల్ వస్తువులు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. సుమారు మూడు గంటల పాటు శస్త్రచికిత్స చేసి అతని కడుపు నుంచి ఆ ఐటమ్స్ తీశారు.ఆ పేషెంట్ కడుపులో ఇయర్ఫోన్స్, వాషర్స్, నట్స్, బోల్టులు, వైర్లు, రాఖీలు, లాకెట్స్, బటన్స్, వ్రాపర్స్, హెయిర్క్లిప్లు, జిప్పర్ ట్యాగ్, సెఫ్టీ ఫిన్లు ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి కేసును ఆపరేట్ చేయడం ఇదే తొలిసారి అని డాక్టర్ అజ్మీర్ కల్రా తెలిపారు. ఆ పేషెంట్ శరీరం నుంచి అన్ని వస్తువుల్ని తీసివేసినా.. అతని ఆరోగ్యం నిలకడగా లేదన్నారు. ఖనిజ వస్తువులు చాన్నాళ్ల నుంచి అతని కడుపులో ఉన్న కారణంగా.. అతని ఆరోగ్యంపై ప్రభావం పడిందని డాక్టర్లు తెలిపారు. ఆ వ్యక్తి ఎందుకు ఆ వస్తువుల్ని మింగాడో అర్థం కావడం లేదని ఫ్యామిలీ సభ్యులు తెలిపారు. అయితే అతను గత కొన్నాళ్ల నుంచి మానసికమైన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.