భాజపా ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుని కలిసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, మునుగోడు ఉప ఎన్నికలు జరుగుతున్నా సందర్బంగా నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ ఈనెల 19 వ తేదీన తెరాసను వీడి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్ అశోక్ నగర్ లోని బిజెపి ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ నివాసంలో ఆయనను బూర నర్సయ్య గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు శాలువా పూల బొకే అందజేశారు. అనంతరం పార్టీ లో చేరిక, పలు అంశాలపై కూలంకషంగా చర్చించారు. వారివెంట భాజాపా పార్టీ పెద్దలు సీసీనియర్ నాయకుల ఉన్నారు.