బిసి సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం నింపాలి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా బీసీ చైతన్య సదస్సులు నిర్వహించి బీసీ సామాజిక వర్గంలో రాజకీయ చైతన్య నింపాలని ఆర్ కృష్ణయ్య పిలుపు నిచ్చారు. విద్యానగర్ బీసీ భవన్ లో బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగిన కార్యక్రమానికి హాజరై కేక్ తినిపించి ఆశీర్వదించారు. అనంతరం బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించకుండాబీసీల ఓట్లతో అధికారంలోకి రావాలని చూస్తున్నాయని, సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే అన్ని రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలను ముట్టడిస్తామనిహెచ్చరించారు. ప్రజాక ర్శక పథకాలు ప్రకటించడంలో అని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయని, బీసీలకు కావలసింది పథకాలు కాదని రాజ్యాధికారంలో వాటా కావాలనిహెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్. విద్యార్థి సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, మద్దూర్ వెంకటేశ్ యాదవ్,నిరంజన్ యాదవ్, కృష్ణ మధు, సందీప్, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.