గాంధీ జయంతిని పురస్కరించుకుని నూతన వస్త్రాల పంపిణీ

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: జాతిపిత మహాత్మా గాంధీ,మాజీ భారత ప్రదాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం పురస్కరించుకొని నల్గొండ్ జిల్లా చిట్యాల బస్సు స్టాండ్ ఆటో స్టాండ్ దగ్గర టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్ పర్సన్ కాకుమాను జ్యోతి ఆద్వర్యం లో 50 మంది పురుషులు, స్త్రీలకు నూతన వస్త్రాలు పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శాంతి, బి.శ్రీనివాస రెడ్డి, మోర నాగేశ్వరరావు, మాదిరెడ్డి శ్రీలక్ష్మి, పి.ఉషా రాణి, మాదిరాజు శ్రీలక్ష్మి, పి.జగదీష్ కుమార్, రాజేష్ నాయక్, జి.రాజు, ప్రవీణ్ ఎస్కే, కొమ్ము ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.