జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్ల్యాండ్స్లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు తెలిపారు.మరోవైపు సముద్రంలో భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సముద్రం వద్దకు వెళ్లొద్దని సూచించారు.