అమ్మవారి ఆలయానికి వెండి విగ్రహం అందజేత
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్ లో చాముండేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 6వ రోజు మహా లక్ష్మి అవతారంలో భాగంగా అమ్మవారికి వెండి లక్ష్మి విగ్రహం బాశెట్టి వరలక్ష్మి రాజశేఖర్ దంపతులు అందజేసినట్లు ఆలయ అర్చకులు బావి శరత్ చంద్ర శర్మ తెలిపారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయ కమిటీ కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ధర్మకర్తలు భక్తులు పాల్గొన్నారు. ఈసందర్బంగా భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.