మునుగోడులో పోలీసులకు పట్టుబడ్డ కోటి రూపాయలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నల్గొండ జిల్లాలోని మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బీజేపీకి చెందిన కోటి రూపాయలు పట్టుబడింది. బీజేపీకి చెందిన నేత వాహనం నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ కౌన్సిలర్ భర్త వాహనంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు.. కేపీ

Leave A Reply

Your email address will not be published.