జూనియ‌ర్ కాలేజీల‌కు 19వ తేదీ నుంచి 25 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు

తెలంగాణా జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలోని జూనియ‌ర్ కాలేజీల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. ఈ నెల 19వ తేదీ నుంచి 25 వ‌ర‌కు ద‌స‌రా సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని బడులకు విద్యాశాఖ సెలవులు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 13 నుంచి 25 వరకు 13 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ బడులకు సెలవులు ఉంటాయని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.