దేశంలో కులగననకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవ
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశంలో కులగణన కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధికారికంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడమనేది ప్రగతిశీలక, శక్తివంతమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. ఇది కీలకమైన ముందడుగుగా ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు సైతం బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సోమవారంనాడు జరిగిన సీడబ్ల్యూసీ సమావేశానంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ, నాలుగు రాష్ట్రాల్లోని తమ (కాంగ్రెస్) ముఖ్యమంత్రులు కులగణను కీలకంగా తీసుకుని దీనిపై తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు.