శ్రీశైలం వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి కుటుంబ సమేత పరంగా వెళ్ళినప్పుడు ఆ దేవస్థానంలోనే కుటుంబ సభ్యులంతా రాత్రి అక్కడే స్టే చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే సరైన వసతి ఉండదు. యాత్రికుల వసతి గృహాలు అప్పటికే బుకింగ్ అయిపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది మనందరకి అనుభవమే. అయితే శ్రీశైలంలో మాత్రం అలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. చాలా తక్కువ ధరలకే మనకు వసతి ఉంటే కుటుంబ సభ్యులంతా చాలా ఆనంద పడతారు.నంద్యాల జిల్లా శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దైవదర్శనం కోసం వచ్చే చాలామంది భక్తులు కుటుంబ సమేత పరంగా వస్తూ ఉంటారు. అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను వారు తిలకించేందుకు రాత్రి సమయంలో శ్రీశైలంలోనే ఫ్యామిలీ మెుత్తంఉండాలంటే అధిక డబ్బులు వారు ఖర్చు చేయవలసి ఉంటుంది.