టీచర్ తిట్టిందని స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకేసిన విద్యార్థిని

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే పలువురు జీవితంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణాకావేశానికి లోనై.. విలువైన ప్రాణాలను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా.. వరంగల్ జిల్లా ఓ విద్యార్థిని చిన్న కారణానికే సూసైడ్ అటెంప్ట్ చేసింది. స్కూల్‌లో టీచర్ తిట్టిందని.. స్కూల్ బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు దూకేసింది.బాలిక తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ ఎల్బీనగర్‌ తిలక్‌రోడ్డులోని మదర్సాలో ఓ 14 ఏళ్ల బాలిక ఫోర్త్ స్టాండర్డ్‌ చదువుతుంది. అదే స్కూల్‌లోని మరో విద్యార్థినితో బాలిక గొడవ పడింది. ఆమె ఫిర్యాదు చేయడంతో టీచర్‌ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. స్కూల్ బిల్డింగ్ మొదటి అంతస్తు మెట్లపై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో బాలిక అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటపడింది. విషయం తెలిసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందితో గొడవకు దిగారు.మందలించిన టీచర్‌పై ప్రిన్సిపల్‌ షాహిద్‌కు కంప్లై్ంట్ చేశారు. మందలించిన టీచర్‌ను సస్పెండ్‌ చేస్తామని ప్రిన్సిపల్‌ హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. గాయపడ్డ విద్యార్థినిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇలా చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం కలకలం రేపుతోంది.

Leave A Reply

Your email address will not be published.