కారులో తరలిస్తున్న 9.50 లక్షల రూపాయలనగదు పట్టివేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల కోడ్ ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర అధికార యంత్రం గారికి ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈపాటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల ఎన్టీఆర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా టీఎస్ 09 ఎఫ్ఏ 2737 నెంబర్ గల కారులో 9.50 లక్షల రూపాయల నగదు తరలిస్తుండగా అవగాహనాన్ని తనిఖీ బృందం పట్టుకొని సీజ్ చేశారు. ఈ కారు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ నుండి తాండూరు వెళ్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి నగదును  సీజ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.