తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్ను ఆయన ఫ్యామిలీ నుంచి రక్షణ కలిపించాలని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్అన్నారు. మంగళవారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రిని ఆయన కొడుకు కేటీఆర్ ఏమైనా చేసిండోనని అనుమానం ఉంది. కేసీఆర్ నాకు గురువు ఆయన నుంచే మాటలు నేర్చుకున్నా, ఆయన ఏమైండు…ఆయన బాగుండాలి. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. అమలు సాధ్యం కానీ హామీలతో అతి గతీ లేకుండా పోతోంది. 5లక్షల కోట్ల అప్పు తెచ్చి కేసీఆర్ ఏమీ చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. కాగా.. ఆదిలాబాద్ సభలో బండి సంజయ్ సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.