కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి పొన్నాల రాజీనామా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని, బజారులో గొడ్డును అమ్ముకున్నట్టు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి భిన్నంగా వ్యక్తి స్వామ్యం నడుస్తుందని, ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి లేదని లేఖలో పేర్కొన్నారు.