తెలంగాణలో ప్రవేశించిన అశోక ధమ్మ యాత్ర
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం, దేశ సమైక్యత కోసం కేరళలో ప్రారంభమైన అశోక ధమ్మ యాత్ర కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి ప్రవేశించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆహ్వానం మేరకు నల్లగొండ జిల్లా నందికొండలోని బుద్ధవనం సందర్శించారు. బుద్ధవనంలోని బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి జాతక పార్కు, బుద్ధచరిత వనం, అవకానబుద్ధ, స్థూప పార్కు, మహాస్థూపంపై ఏర్పాటు చేసిన శిల్పాలు, ధ్యాన మందిరాన్ని సందర్శించి, మహాస్థూపంలోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యాత్ర సభ్యులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ వారసత్వ సంపదగా బుద్ధవనం నిర్మాణం చేపట్టారన్నారు. వారికి బుద్ధవనం విశేషాలను బుద్ధవనం ఎక్స్ఫర్ట్, కన్సల్టెంట్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. అంతకుముందు యాత్ర బృందానికి బుద్ధవనం సహాయక శిల్పి శ్యాంసుందర్, అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.