భారత్ సమాజ్ డెవలప్ పార్టీ ఎన్నికల గుర్తుగా వాటర్ ట్యాంక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్ సమాజ్ డెవలప్ పార్టీ ఎన్నికల గుర్తుగా వాటర్ ట్యాంక్ ని ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగింది అని భారత్ సమాజ్ డెవలప్ పార్టీ జాతీయ అధ్యక్షులు చింతాడ సూర్యం తెలియచేసారు. తమ పార్టీ నుండి పోటి చేయదాదాని అబ్యర్తులనుండి దరఖాస్తులు వస్తున్నాయని  వాటిని పరిశీలించి విజయదశమి రోజు అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. గురువారం హైదరాబాద్ లో మీడియా సమావేశం లో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కుమారి యామిని లక్ష్మీ తో కలిసి మాట్లాడారు. అనంతరం  కుమారి యామిని లక్ష్మీ మాట్లాడుతూ పార్టీ ముఖ్య ఉద్దేశం పేదరిక నిర్ములన, సమాన హక్కులు, మహిళ రాజ్యాధికారం, అందరికీ అందుబాటులో విద్య, వైద్యం, సైద్యం, పర్యావరణ పరిరక్షణ, మూగజీవాల సంరక్షణ  కచ్చితంగా పాటిస్తామని అదే విధంగా తమ పార్టీ మేనిఫెస్టో ఇతర BRS, కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రజలను మోసం చేసే మేనిఫెస్టో లా ఉండదని రెండురోజులు వ్యవదిలో ప్రకటిస్తామని తెలియచేశారు. అంతే కాకుండా ప్రజలను హామీల పేరుతో, స్కీముల స్కాములతో కాకుండా స్వచమైన పరిపాలన అందిస్తామని తెలియచేశారు.. ఈ కాన్ఫరెన్స్ కార్యక్రమం లో రాష్ట్ర అధ్యక్షులు కాజా గారు, ప్రధాన కార్యదర్శి పొట్ట మధుకర్, బోడ గణేష్ ఇతరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.