27 అసెంబ్లీ స్థానాల్లో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పోటీ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 27 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పోటీ చేయబోతున్నట్లు ఆపార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇనుగాల భీమారావు వెల్లడించారు. ఇప్పటికే 47 అప్లికేషన్లు వచ్చాయన్నారు.అందులో ప్రధానoగా సికింద్రాబాద్, సనత్నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, సెరిలింగంపల్లి,ఎల్బి నగర్, హుజూరాబాద్, హుస్నాబాద్, నక్రేకల్, వర్ధన్నపేట, కంటోన్మెంట్, చేవెళ్ల అసెంబ్లీ లున్నాయని అయన వివరించారు. అయితే కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉన్నందున తెలంగాణలో సీట్ల విషయంపై తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పారస్ నిర్ణయo తీసుకుంటారని భీమారావు అన్నారు.