చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం చేయనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనడ్డాఅమిత్ షా సహా 40 మందితో స్టార్ క్యాంపెయినర్ జాబితాను బీజేపీ విడుదల చేసింది.జేపీ నడ్డా నివాసంలో బీజేపీ తెలంగాణ కోర్ గ్రూప్ నేతల సమావేశం ముగిసింది. సమావేశంలో తరుణ్ ఛుగ్ప్రకాష్ జవదేకర్కిషన్ రెడ్డిడీకే అరుణడా. కే. లక్ష్మణ్బండి సంజయ్ఈటెల పాల్గొన్నారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. నడ్డాతో భేటీకి ముందు జవడేకర్ నివాసంలో మధ్యాహ్నం నుంచి సుదీర్ఘ మంతనాలు జరిపారు.తెలంగాణ నుంచి కేవలం బండి సంజయ్‌ను మాత్రమే ఛత్తీస్ గఢ్ ఎన్నికల ప్రకాచారంలో బీజేపీ ఉపయోగించుకుంటోంది. నడ్డాతో గంట తర్వాత మరోసారి తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది.

Leave A Reply

Your email address will not be published.