తాపేశ్వరంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్పంచ్ వాసంశెట్టి రాజరాజేశ్వరి శ్రీనివాసు ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ  జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వైద్య పరీక్షలతో పాటు వైద్యులు సూచించిన మందులు కూడా ఉచితంగా ఇస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా రూ. పదివేల రూపాయలతో గర్భిణీలకు గ్రామ వైసిపి నాయకులు, వాసవి క్లబ్ జోన్ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సేవాదళ్ కోశాధికారి గ్రంధి సూరి పండు సహకారంతో శీమంతం కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో వైసిపి గ్రామ అధ్యక్షుడు నాగిరెడ్డి రాంబాబు, జడ్పిటిసి కురుపూడి భవాని రాంబాబు, ఎంపిటిసిలు, వైసీపీ నాయకులు వల్లూరి రామకృష్ణ, అడ్డాల రాజు, వల్లూరి వీరస్వామి, ఎంఇఓ సోమిరెడ్డి, పంచాయితీ కార్యదర్శి తదితరులు పి శ్రీనివాస్, అంగన్వాడి సూపర్వైజర్ సత్యవేణి, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.