ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. కాంగ్రెస్‌ లో చేరుతున్నారు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజలు మార్పు కోరుకుంటున్నారనికాంగ్రెస్‌ లో చాలా మంది చేరుతున్నారనితన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక విషయం తనతో మాట్లాడలేదని.. అధిష్టానంతో మాట్లాడారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడే కాదని.. చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారనికర్ణాటక లో హామీ ఇచ్చిన పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. సెకండ్ లిస్ట్ ఈరోజు పూర్తవుతుందనిరేపు విడుదల అవుతుందని చెప్పారు. 6 స్థానాల్లో మాత్రమే ఇబ్బందులు ఉన్నాయనిఅక్కడ ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్నారని ఆయన అన్నారు.సీఈసీ ఫైనల్ అయ్యేవరకు బయట మాట్లాడకూడదనిగతంలోనే కాళేశ్వరం పై విచారణ జరపాలని ప్రధానికి లేఖ రాసామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. వామపక్షాలకు నాలుగు సీట్లు అంటే తక్కువ కాదనిమిర్యాలగూడలో కూడా అడిగారనిఅక్కడ ఓటు ఎంత వరకు ట్రాన్స్‌ఫర్ అవుతుందనేది చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 70 నుంచి 80 సీట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులపై బుధవారం సాయంత్రం క్లారిటీ వస్తుందన్నారు. రాహుల్ గాంధీ పేరు చెప్పే అర్హత కేటీఆర్‌ కు లేదనిరాహుల్ గాంధీ కుటుంబానికి ఇల్లు కూడా లేదనిఇప్పుడు మీ ఆస్తులెంత కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.