బీఆర్‌ఎస్, ఎంఐఎంది రాజకీయ అక్రమ సంబంధం        

- బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శల వర్షం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో పార్టీలన్నీ ప్రచారం జోరు పెంచాయి. పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలుఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ఎంఐఎం పార్టీలపై టీ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. బీఆర్‌ఎస్ఎంఐఎంది రాజకీయ అక్రమ సంబంధం అని ఆయన ఆరోపించారు. అన్న తమ్ముడు పోయిమళ్లీ మామ అలుళ్లు అయ్యారని అన్నారు. కేటీఆర్ బీసీలకు గుణం లేదని అన్నాడంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్కేటీఆర్కవితకు గుణం ఉందా అని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన సంజయ్ కాంగ్రెస్బీఆర్‌ఎస్ఎంఐఎం మూడు పార్టీలూ ఒక్కటేనని అన్నారు. ‘‘బీఆర్ఎస్ఎంఐఎంది రాజకీయ అక్రమ సంబంధం. అన్నతమ్ముడు పోయి.. మళ్లీ మామ అలుళ్లు అయ్యారు. కేటీఆర్ బీసీలకు గుణం లేదంటావానీ అయ్యకునీ చెల్లెలికినీకు గుణం ఉందామా బీసీలనే అవమానిస్తావానీ పొగరు అణచివేస్తాం. బీసీలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి. కాంగ్రెస్బీఆర్‌ఎస్ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే.’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.