విజయసాయిరెడ్డి పై సుప్రీంకోర్టు సిజేఐ కు పురందేశ్వరి లేఖ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ విజయ్ సాయిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పురందేశ్వరిపై ఎంపీ విజయసాయి మరోసారి సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ…తెలంగాణలో మీ మరిది కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో బీసీ నాయకుడు పార్టీకి రాజీనామా చేశాడని అన్నారు.  ‘తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతిస్తున్న టిడిపికి ఏపీలో మీరు నేరుగా మద్దతిస్తున్నారు. మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటీల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే రాజకీయమా? అంటూ చురకలంటించారు. ఈ ట్వీట్ తరువాత పురంధేశ్వరి భిన్నంగా స్పందించారు.  విజయ్ సాయి రెడ్డిపై సుప్రీంకోర్టు సిజెఐకి పురంధరీశ్వరి లేఖ రాశారు. విజయ్ సాయి రెడ్డి పదేళ్లుగా బెయిల్ పై కొనసాగుతూ సిబిఐ, ఈడి కేసుల విషయంలో షరతులు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఏపీలో ఈ పోటాపోటీ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.