కొనసాగుతున్న నామినేషన్ల పర్వం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టం శుక్రవారం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. తొలి రోజున అంతంత మాత్రంగానే అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. ఈ క్రమంలో మహానగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల వద్ద ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆర్వో సెంటర్‌కు వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్‌ విధించి ఏర్పాట్లు చేశారు.తొలి రోజున ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మినహా స్వతంత్ర, రెబల్‌ అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు.ఇది ఎలా ఉండగా పార్టీ పిరాయిన్పుల పర్వం కొనసాగుతుంది. ఆశా హహులు టిక్కెట్ల ఆశతో ఎదిరి చూస్తున్నారు. బేరసారాలు కొనసాగుతున్నాయి. ప్రచారం చేసుకునే వారు చేసుకుంటున్నారు. మరికొందరు జ్యోతిష్యులను సంప్రదిస్తుండగా, మరికొందరు’బి’ ఫామ్ ల కోసం చిన్న చిటుక పార్టీలను సంప్రదిస్తున్నారు.ఇదే అదనుగా దోచుకునే వారు దోచుకుంటున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.