ముగ్గురు ముఖ్య నేతల రాజకీయ ప్రయోగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. ముగ్గురు కీలక నేతలు ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండటం ఆసక్తికర పరిణామంగానే చెప్పుకోవాలి. తొలుత బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పోటీ చేసే రెండవ నియోజకవర్గం గురించి లీకులు ఇచ్చారు…కామారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పలు మార్లు కోరటంతో కెసిఆర్ ఇందుకు ఒప్పుకున్నారు అని ప్రచారం చేశారు. తర్వాత విచిత్రంగా సీఎం కెసిఆర్ స్వయంగా మీడియా సమావేశంలో తాను రెండు చోట్ల పోటీ చేయాలని పార్టీ డిసైడ్ చేసింది అని చెప్పి అందరిని షాక్ కు గురి చేశారు. తర్వాత కామారెడ్డి అభివృద్ధి కోసమే కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ రకరకాల ప్రచారాలు తెరపైకి తెచ్చారు. కారణాలు ఏమైనా కెసిఆర్ రెండు నియోజకవర్గాలు అంటే అటు గజ్వేల్, ఇటు కామారెడ్డిలో బరిలోకి దిగటం అన్నది తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుంది అనే అభిప్రాయం కొంత మంది బిఆర్ఎస్ నేతలు కూడా వ్యక్తం చేశారు. అయితే రెండు చోట్ల బరిలోకి దిగుతున్న కెసిఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేసే వ్యూహాలతో ప్రతిపక్షాలు సిద్ధం కావటంతో ఈ మొత్తం వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అసలు అసెంబ్లీ బరిలో లేకపోవటం విచిత్రం అయితే…మాజీ మంత్రి…బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం బీజేపీ తరపున గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీ చేస్తూనే ..తన సొంత నియోజకవర్గం హుజురాబాద్ నుంచి కూడా బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక ముందే ఈటల తాను కెసిఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే బీజేపీ అధిష్టానం ఈటల ను రెండు చోట్ల పోటీకి దింపింది.

Leave A Reply

Your email address will not be published.