గాజా పై కొనసాగుతున్న దాడులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి నెలైనా పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. గత నెల 7వ తేదీన హమాస్ ఆకస్మిక దాడులు చేసినప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 10వేల మందికిపైగా మరణించారు. మరోవైపు మానవతా సాయం అందక 23 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్తు, ఔషధాలు అందక గాజా వాసులు అల్లాడుతున్నారు.