ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తు్ననారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ.. తనదైన ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే.. సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో సీఎం పాల్గొంటున్నారు.