పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల సిబ్బందిని విడివిడిగా ఉంచి ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి కుటుంబ సభ్యులను ఐటీ అధికారులు కలుసుకోనివ్వలేదు. పొంగులేటి ఇంటికి మరో ఐటీ బృందం వచ్చి సోదాలు చేస్తోంది. పొంగులేటి ఇంటి ముందు ఆయన అభిమానులుకాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది. పోంగులేటి తనపై‌‌ ఐటీఈడీ దాడులు జరుగుతాయని ముందే చెప్పారు.పొంగులేటి ఇంటి ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉపేందర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. బాధిత ఉపేందర్ ముదిగొండ మండలం కట్కూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. బాధితుడిని అడ్డుకుని అతనిపై నేతలు నీళ్లు పోసి కాపాడారు. పొంగులేటి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.