ఇంటింటి ప్రచారం నిర్వహించిన యెండల లక్ష్మీనారాయణ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భాజపా బలపర్చిన బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ శనివారం  నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  సందర్బంగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ప్రచారం ఉదయం సోమేశ్వర్ గ్రామం లోని శ్రీ సోమలింగేశ్వరున్ని దార్చించుకున్న ఆయన అనంతరం సోమేశ్వర్ గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం దేశాయిపేట్, పోచారం, పోచారం తండా, రాంపూర్, బస్వాయిపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. 2 గంటలకు అంకోల్ గ్రామంలో మధ్యాహ్న భోజనం చేశారు. అక్కడ నుండి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి ప్రచారం  ప్రారంభించి అంకోల్ తండా, సంగేమ్, కట్టకింది తండా, హాజీపూర్, దుర్కి గ్రామాలలో ప్రచారం కొనసాగించారు. ఈయన వెంట నసురుల్లాబాద్ మండల  బిజెపి అధ్యక్షులు సున్నం సాయిలు, నాయకులూ, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.