టి ఆర్ ఎస్ వేసిన పిటిషన్ కొట్టివేత

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇండిపెండెంట్ల కు సంబంధించిన 8 గుర్తులను రద్దు చేయాలని టీఆరెస్ వేసిన పిటీషన్ ను గౌరవ న్యాయస్థానం కొట్టేయడం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ న్యాయం ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో ఒడిపోతామన్న భయం తో ఎదో ఒక వంక తో ఎన్నికలను ఆపాలని టీఆరెస్ కుట్ర చేస్తోంది. అందులో భాగంగానే ఇండిపెండెంట్ ల 8 గుర్తుల రద్దు చేయాలని టీఆరెస్ కోర్టును ఆశ్రయించింది. టీఆరెస్ ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయం గెలుస్తుంది- మునుగొడులో బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కి న్యాయస్థానం పై గౌరవం ఉంది ఈ గుర్తులు TRS పార్టీ పుట్టినప్పటి నుంచి నుంచి  న్నాయి. ఇన్నాళ్లు లేని అభ్యంతరం ఇప్పుడేమి వచ్చిందో. కేవలం ఎన్నికలను ఆపాలన్న దురుద్దేశం తోనే టీఆరెస్ రిట్ పిటీషన్ వేసింది. కానీ న్యాయ స్థానం  దు టీఆరెస్ కుతంత్రాలు పనిచేయలేదు.

Leave A Reply

Your email address will not be published.