అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నాంపల్లి అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అంతకముందు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తామని, ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని వారిని కూడా ఆదుకుంటామని ఆయన హామీనిచ్చారు. ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సాయంత్రంలోగా పీఎం కేర్స్ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.