పోలీస్ కానిస్టేబుల్ పై గొడ్డలితో దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్ : పోలీస్ కానిస్టేబుల్ పై ఒక మందు బాబు గొడ్డలితో దాడి చేసిన ఘటన తూప్రాన్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఇలియాస్ బీసీ లో భాగంగా నర్సాపూర్ రోడ్డు గల ఎన్ఎస్ 44 బ్రిడ్జి వద్ద డిడి ఫైన్స్ వేసే సమయంలో తాగి బండి నడుపుతున్న ఓ వ్యక్తిని ఆపి పేరు వివరాలు అడగ్గా సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఒక అర్థగంట తర్వాత గొడ్డలి తీసుకొని వచ్చి డిడి ఫైన్ వేస్తున్న ఆఫీస్ కానిస్టేబుల్ మెడపై నరకంగా తీవ్ర గాయం  కావడం తో పాటు అధికంగా రక్తం పోయింది. అతన్ని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నేరస్తున్ని తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.