మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో  కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన అధిక్యంలో కొన‌సాగుతోంది. ప్రస్తుతం అందున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ 65 స్థానాలు, బీఆర్ఎస్ 39, బీజేపీ 9, ఎంఐఎం 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు కాంగ్రెస్ 13 స్థానాల్లో విజ‌యం సాధించింది. బీఆర్ఎస్ 4, ఎంఐఎం 3, బీజేపీ 1 స్థానంలో విజ‌యం సాధించాయి. ఈ ఎన్నిక‌ల్లో కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఘ‌న విజ‌యం సాధించారు.  తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్ మునుగోడులో 21 వేల ఓట్లతో కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఉప ఎన్నిక‌లో ఓడిపోయారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.  రాజ్ గోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన త‌ర్వాత కాంగ్రెస్ తరుపు నుంచి 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఘన విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కూడా ఆయ‌న ప‌నిచేశారు. 2016-2018 వరకు కోమ‌టి రెడ్డి  ఎమ్మెల్యేగా పనిచేశారు. 2018లో మునుగోడు అసెంబ్లీ నుంచి గెలిచారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

Leave A Reply

Your email address will not be published.