దుబ్బాకలో ఓటమి చవిచూసిన రఘునందన్ రావు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన రఘునందన్ రావు ఓటమి పాలయ్యారు. ఈ సీటు నుంచి బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మెదక్ జిల్లాలోని దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దుబ్బాకలో ప్రచారం చేస్తుండగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి పోటు దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడి బీజేపీ హస్తంతోనే జరిగిందని అప్పుడు ప్రచారం జరిగింది. ఈ ఘటన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై నెగెటివ్‌గా పని చేసినట్టు తెలుస్తున్నది. కత్తి పోటు ఎఫెక్ట్‌తో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయినట్టు సమాచారం. Also Read: గాంధీ భవన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ఫలితాలు లైవ్ అప్డేట్ కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా బలమైన నేత. ఎంపీగా గెలుపొందారు. దుబ్బాకలో బీజేపీని టార్గెట్ చేసుకునే బీఆర్ఎస్ బలమైన నేతను బరిలోకి దించింది.

Leave A Reply

Your email address will not be published.