ఆంధ్ర లో అదృశ్యమైన విద్యార్థులు తెలంగాణలో ప్రత్యక్షం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ దొరికింది. ఈ ముగ్గురు తెలంగాణలోని కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఉండగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కామారెడ్డి పోలీసులు ఏపీ పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు విద్యార్థులు ఏడో తరగతి చదువుతున్నారు.. వీరు బుధవారం సాయంత్రం తిరుమలలో అదృశ్యం అయ్యారు.తిరుమల ఆర్బీసీ సెంటర్లో నివాసం ఉంటున్న ఎస్ కృష్ణ కుమారుడు ఎస్ చంద్రశేఖర్(13), జి శ్రీవర్దన్(13), యోగేష్ కుమారుడు వైభవ్ యోగేష్(13)లు తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్లి స్కూల్లో జరుగుతున్న పరీక్షకు తిరిగి హాజరుకాలేదు. వెంటనే స్కూల్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురి కోసం ఎంత గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సీసీ కెమెరాలు పరిశీలించగా విద్యార్థులు ల్యాప్టాప్లతో తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులో తిరుపతికి చేరుకున్నట్లు గుర్తించారు. అలా ఆరా తీస్తే కామారెడ్డిలో ఆచూకీ దొరికింది. వీరు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అనేద క్లారిటీ లేదు.. పరీక్షల భయంతో ఏమైనా వెళ్లిపోయారా అనే అనుమానాలు ఉన్నాయి.