రైల్వేజోన్ ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏపి ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పార్లమెంటు సాక్షిగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది. రైల్వేజోన్‌పై లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు లేవనెత్తారు.టీడీపీ ఎంపీ ప్రశ్నపై స్పందిస్తూ వైజాగ్ రైల్వేజోన్ డీపీఆర్ తయారైందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ముడసర్లోవలోని 52.2 ఎకరాల భూమిలో రైల్వేజోన్ ప్రధాన కార్యాలయ నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించామని అశ్వనీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం భూమిని అప్పగించలేదని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.