ముఖ్యమంత్రికి తెలంగాణ ఎడిటర్స్ అసోసియేషన్ శుభాకాంక్షలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమం త్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ ఎడిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలంగాణ ఎడిటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి హరిప్రసాద్ , ప్రధాన కార్యదర్శి ఎం ఏ రఫీ తెలిపారు. మీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఇందుకు మా పాత్రికే సోదరులు తమ వంతు తగిన విధంగా కృషి చేస్తారని పేర్కొన్నారు. గత కాలంలో జర్నలిస్టులు, ఎడిటర్లు ఎన్నో ఓడి దుడుకలు ఎదుర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టులకు రక్షణ కల్పించి, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. గత తొమ్మిదిన్నరేళ్ళుగా తెలంగాణ మీడియా, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టులకు అనేక అవమానాలు, ఛీత్కారాలు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా ప్రభుత్వం నడవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పని చేస్తారని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ప్రధానంగా జర్నలిస్టులకు ఇండ్ల స్తలాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ ఎడిటర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గుమ్మడి హరిప్రసాద్ , ఎం ఏ రఫీ లు పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.